విశాఖకు కేంద్రం అండగా వుంటుంది

 

హుదుద్ తుఫాను ధాటికి కకావికలు అయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖపట్నం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. విశాఖ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా వుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. బుధవారం నాడు ఆయన విశాఖలో పర్యటించారు. విశాఖలో తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున పక్కా ఇళ్ళు మంజూరు చేయనున్నామని వెంకయ్య తెలిపారు. బుధ, గురువారాల్లో తాను విశాఖపట్నంలోనే వుంటానని, ఈ ఏడాది దీపావళిని తాను విశాఖ తుఫాను బాధితులతో కలసి జరుపుకుంటానని వెంకయ్య చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu