విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నివేదికలు సిద్దం

posted on: Apr 26, 2015 9:45PM

 

విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించనున్న మెట్రో స్పెషలిస్ట్ శ్రీధరన్ రెండు ప్రాజెక్టుల నివేదికలను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. వీటిలో విజయవాడ ప్రాజెక్టు నిర్మాణానికి కి.మీ.కి 209కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ ప్రకారం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 6,823 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసారు. విజయవాడలో రెండు మెట్రో కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నారు. వాటిలో ఒకటి విజయవాడ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12.76 కిమీ కారిడార్, రెండవది బస్టాండ్ నుంచి నిడమానూరు వరకు 13.27 కిమీ కారిడార్ నిర్మించేందుకు పూర్తి నివేదికను సిద్దం చేసారు. తాజా సమాచారం ప్రకారం విశాఖలో మూడు మెట్రో కారిడార్లు నిర్మించబోతున్నారు. త్వరలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నివేదిక వివరాలను కూడా ప్రకటిస్తారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...