నేను అలా అనలేదు...

 

ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను కెప్టెన్ కోహ్లీ ఇకపై ఆసీస్ ఆటగాళ్లు ఎప్పుడూ స్నేహితులు కాలేరు అంటూ వ్యాఖ్యానించిన సంగతి కూడా విదితమే. అయితే దీనిపై స్పందించిన కోహ్లీ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. త‌న కామెంట్స్‌ను చాలా ఎక్కువ చేసి చూపించార‌ని, తాను కొంతమంది గురించే ఆ వ్యాఖ్య‌లు చేశాన‌ని విరాట్ స్ప‌ష్టంచేశాడు. ఒక‌రిద్ద‌రు ఆసీస్ ప్లేయ‌ర్స్‌పైనే త‌న అభిప్రాయం మారింద‌ని, మిగ‌తా ప్లేయ‌ర్స్‌తో స్నేహం కొన‌సాగుతుంద‌ని కోహ్లి ట్వీట్ చేశాడు.