కల్తీ మద్యం కేసుపై సిట్..

కల్తీ మద్యం ఘటనపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా దర్యాప్తు చేపడుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు స్వర్ణ బార్ సీసీ పూటేజ్ ను కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కల్తీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ మహేశ్ చంద్ర లడ్డా ఆధ్వర్యంలో ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటనపై డీజీపీ రాముడు మాట్లాడుతూ కల్తీ మద్యం దందాపై ఉక్కుపాదం మోపుతాం.. అయితే ఈ వ్యవహారంపై ఎవరిపై ఆరోపణలు చేయం.. నిజనిజాలు తేలిన తరువాతే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu