Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కలిసుండటమెందుకు అంటున్న వెంకీ..?
posted on: Oct 8, 2013 3:08PM

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం విజయం తర్వాత వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ తో కలిసి "మసాలా" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే వెంకటేష్ మరో మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకటేష్, రామ్ చరణ్ కలిసి బాబాయ్,కొడుకులుగా నటించబోతున్నారు. ఈ చిత్రానికి "కలిసుండటమెందుకు" అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారు. ఇందులో వెంకటేష్ అన్నగా నాగబాబు నటించనున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నాడు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.






