నావల్లే నెలకో ప్రాజెక్టు... వెంకయ్యనాయుడు

 

ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విద్యార్ధి జేఎసీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రత్యేకహోదా విషయం చాలా కీలకమైన అంశమని, కేంద్రం ప్రభుత్వం దీని గురించి చర్చలు జరుపుతుందని అన్నారు. రెండు రాష్ట్రాలకు అధిక ప్రాజెక్టులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనేక ఉన్నత సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చానని, కేంద్రంలో తాను ఉండబట్టే తెలుగు రాష్టాలకు నెలకో ప్రాజెక్టు వస్తుందన్నారు. 14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని ఆయన తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu