TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ హామీ ఇస్తే సస్పెండ్ ఎత్తివేస్తాం.. వెంకయ్యనాయుడు

Published on: Fri Aug 7, 2015 5:54PM

 

పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గరనుండి కాంగ్రెస్ నేతలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్ల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడికిపోతుంది. లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ఆందోళనలు చేపట్టారు. దీంతో స్పీకర్ 25 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. దీనిపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు ప్రభత్వం సిద్ధంగా ఉందని.. సస్పెన్షన్‌ ఎత్తివేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. సభ సజావుగా సాగనిస్తామని హామీ ఇస్తే కాంగ్రెస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు ఎత్తివేస్తామని అన్నారు.