Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సుప్రీంకోర్టుపై గ్రేనేడ్లతో దాడి....
posted on: Jun 28, 2017 12:03PM
.jpg)
ఏకంగా సుప్రీంకోర్టుపైనే గ్రేనేడ్లతో దాడి చేసిన ఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... వెనిజులా సుప్రీంకోర్టుపై హెలికాప్టర్తో దాడి చేశారు. అయితే దాడి చేసింది ఓ ఆర్మీ ఆఫీసరే అని తెలుస్తోంది. ఓ ఆర్మీ ఆఫీసర్ రాజధాని కారకస్లో ఉన్న సుప్రీంకోర్టుపై హెలికాప్టర్తో దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆ ఆర్మీ ఆఫీసర్ హెలికాప్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అంతేకాదు ఆ దాడి చేసింది తానే అని ఆర్మీ ఆఫీసర్ ఆస్కార్ పిరేజ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రకటన చేశాడు. ఇంక దీనిపై స్పందించిన దేశాధ్యక్షుడు నికోలస్ మాడురో దీనిని ఉగ్రదాడిగా చిత్రీకరించారు.



.jpg)


