పార్టీలోనే కొనసాగుతా ... వంశీ
posted on Mar 28, 2013 8:28AM
విజయవాడ ఎంపి, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ గాలివార్తలకు తెరదించారు. ఆయన స్థానంలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కేశినేని శ్రీనివాస్ (నాని), నగర పార్టీ అధ్యక్షునిగా నాగుల్ మీరాను, రాష్ట్ర కమిటీలోకి వంశీని మంగళవారం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీంతో వంశీ అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే వంశీ మాత్రం తనకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాటే తనకు శిరోధార్యమని, ఆయన మాట ఏదీ కాదనలేదని, ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా నిర్వహిస్తానని తెలిపారు తాను తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళుతున్నట్లు వస్తున్న పుకార్లు అవాస్తమని వల్లభనేని వంశీ బుధవారం తెరదించారు. గన్నవరం సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తాననడం కూడా పుకారే అని వంశీ తెలిపారు.