ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగించాలి.. సుప్రీం

 

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఉత్తరాఖండ్  హైకోర్టు నిర్ణయాన్ని రద్దు చేస్తూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో శాస‌న‌స‌భ‌లో ఈనెల‌ 29న హరీష్ రావత్ నిర్వహించాలనుకున్న బ‌ల నిరూప‌ణ పరీక్ష రద్దయింది. కేసు తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఉత్త‌రాఖండ్ హైకోర్టు నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిష‌న్‌ వేసిన సంగతి తెలిసిందే.