Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సివిల్స్ పరీక్షను వాయిదా వేయండి
posted on: Dec 13, 2015 9:17PM

ఈనెల 18 నుంచి 23 వరకు జరగనున్న యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. ఇటీవలి భారీ వరదలకు తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇప్పుడున్న పరిస్థితులలో తమిళనాడుకు చెందిన అనేక మంది విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితిలో లేరని ఆమె తెలిపారు. ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేసి తమ రాష్ట్ర అభ్యర్థులకు సహకరించాని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు.






