నీటి రైలును అడ్డుకున్న యూపీ ప్రభుత్వం.. మాకు అవసరం లేదు..

 

ప్రస్తుతం మహారాష్టలోని లాతూర్ నీటి ఎద్దడితో అలమటిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రత్యేక నీటి రైళ్ల ద్వారా నీటిని తెప్పించి మరీ ప్రభుత్వం వారి కష్టాలను తీర్చుతోంది. లాతూర్ తో పాటు ఉత్తరప్రదేశ్ కూడా నీటి సమస్యతో అల్లాడుతోంది. లాతూర్ లాగే వీరికి కూడా కేంద్రం నీటి రైలు పంపింది. కానీ ఆరాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు నీటి రైలు వద్దని చెప్పి దానిని అడ్డుకుంది. ఎల్లుండి ఆ రాష్ట్ర సీఎం ప్రధాని మోదీతో నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌పై భేటీ కానున్నారు. బుందేల్‌ఖండ్‌కు అఖిలేశ్ ప్ర‌భుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.