పోలీసులపై కాల్పులు.. ఎస్పీ సహా 14 మంది మృతి
Published on: Fri Jun 3, 2016 10:32AM

ఉత్తరప్రదేశ్ లో కాల్పుల కలకలం రేగింది. రాష్ట్రంలోని మథుర పోలీసులపై స్థానికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ కోర్టు ఆదేశాల మేరకు మథురలోని జవహార్ భాగ్ ప్రాంతంలో అక్రమణలను తొలగించేందుకు వచ్చిన పోలీసులపై అక్రమణదారులు తుపాకులు, గ్రానైడ్లతో దాడి చేశారు. ఈ కాల్పుల్లో ఎస్పీతో సహా 14 మంది మృతి చెందారు. 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎస్పీ, కానిస్టేబుళ్లు ఉన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్యాదవ్ ఆదేశించారు.


