Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజకీయ నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసహనం
posted on: Mar 21, 2012 11:11AM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రాజకీయ నిరుద్యోగుల్లో అసహనం నానాటికి పెరుగుతోంది. గ్రామ పంచాయితీలు, జిల్లా, మండల పరిషత్ లు, మున్సిపాలిటీలు, నీటి సంఘాలు తదితర పాలక మండళ్ళ పదవీకాలం ముగిసి అనేక నెలలు కావస్తోంది. ఒక్కప్పుడు ఈ పదవులు ఆశించిన చోటా మోటా నాయకులంతా ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మారారు. మళ్ళీ వీటికి ఎన్నికలు జరిగితే వారికి ఉపాధి లభిస్తుంది. కాని ప్రభుత్వం మాత్రం వీటికి ఎన్నికలు జరిపించకుండా 6 నెలలకొకసారి అధికారుల పాలనను పొడిగిస్తూ వస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి చిన్నా చితకా పదవులు లభిస్తాయి. ఈ పదవులకు తగ్గట్టుగా ఎంతోకొంత ఆదాయం ఉంటుంది. సుమారు రెండేళ్ళుగా ఖాళీగా ఉన్న ఈ రాజకీయ నిరుద్యోగులు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎమ్మెల్యే, ఎంపిలపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తే ఇప్పటికే ఉన్న రాజకీయ నిరుద్యోగులతోపాటు కొత్తవారు కూడా పోటీకి తహతహలాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ నుంచి తమకు అవకాశం దక్కుతుంది, స్థానికంగా ఏఏ వర్గాల మద్దతు తీసుకోవాలి, ఎన్నికల ఖర్చు ఎంతవుతుంది, విజయావకాశాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై కొత్త అభ్యర్ధులు లెక్కలు వేసుకుంటున్నారు.


.jpg)
.jpg)


