పోలవరంపై ఉమాభారతి.. రెండు రాష్ట్రాలు మాట్లాడుకుంటేనే మంచిది..

posted on: Dec 10, 2015 2:27PM

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తూ ఒడిశా ఎంపీలు పార్లమెంట్ దగ్గర నిరససలు చేసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాకు తీవ్ర నష్టం కలుగుతుందని ఒడిశా ఎంపీలు ఆరోపించారు. దీనిపై ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా చేసిన అభ్యంతరాలను ఏపీ దృష్టిలో పెట్టుకోవాలని.. రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకుంటేనే మంచిదని.. ముందే సమస్యలు పరిష్కారించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. పోలవరం గిరిజనుల జీవితాలతో ముడిపడిఉన్న సున్నితమైన అంశమని.. కాబట్టి ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిదిని అన్నారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం తప్పకుండా సహకరిస్తుందని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...