TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉదయ్ అలాంటివాడు కాదు: రేష్మా

Published on: Tue Jan 7, 2014 9:01AM

 

నటుడు ఉదయ్ కిరణ్ మరణ వార్త అందరికి కూడా ఒక పీడ కలగానే అనిపిస్తుంది. సినీపరిశ్రమలో అందరూ కూడా ఉదయ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నటి రేష్మా కూడా ఉదయ్ తో ఉన్న తన గత స్మృతులను గుర్తుచేసుకుంది. వీరిద్దరూ కలిసి "జై శ్రీరామ్" అనే చిత్రంలో నటించారు. "ఆయన మరణం ఓ కలగా ఉంది. ఉదయ్ చాలా ధైర్యంగా ఉండేవారు. షూటింగ్‌లో తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అతనితో నటించిన 'జై శ్రీరామ్" నా తొలి యాక్షన్ మూవీ. షూటింగ్ సమయంలో నా నటనలో లోటుపాట్లను గుర్తించి , నాకు చాలా మెలకువలు చెప్పేవారు. నాకు తెలిసి ఉదయ్ దంపతులు చాలా సంతోషంగా ఉండేవారు. ఆయన సినిమాలు ఫెయిల్ అవుతున్నాయనే మనస్తాపంతో చనిపోయేటంతటి పిరికివాడెం కాదు ఉదయ్. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను" అని చెప్పుకొచ్చింది.