గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన ఇద్దరు

posted on: Feb 17, 2025 3:47PM

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు నిందితులు సరెండర్ అయ్యారు. టీడీపీ ఆఫీసుపైదాడికేసులో మొత్తం 88 మంది నిందితులు  ఉన్నారు. వారిలో జానీ, కలామ్ అనే వ్యక్తులు సోమవారం  గన్నవరం పోలీసులు ఎదుట లొంగిపోయారు. 
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన  జరిగింది.  కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక కేసును రీఓపెన్ చేశారు. 
ఈ కేసులో ఏ71గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇటీవలె ఎపి పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కాకుండా   కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...