సిలెండర్ పేలి రెండు ఇళ్లు దగ్ధం

posted on: Oct 3, 2025 9:28AM

జిల్లాలో పండుగపూట గ్యాస్ సిలిండర్ పేలి రెండు ఇళ్లు ధ్వంసమైన ఘటన నంద్యాల  జిల్లా శివనగరంలో జరిగింది. బాధితుల కథనం మేరకు గ్రామానికి చెందిన  గోవింద్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. అయితే అలా వెళ్లే సమయంలో గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఆపడం మరచిపోయారు. దీంతో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోవందరెడ్డి ఇంటితో పాటు.. పక్కనే ఉన్న ఇళ్లు దగ్ధమైంది. పేలుడు సంభవించిన సమయంలో రెండు ఇళ్లలోనూ కూడా ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ పేలుడు కారణంగా రెండు ఇళ్లలోనూ విలువైన సామాగ్రి కాలి బూడిదైంది. దాదాపు 40 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా.  

google-ad-img
    Related Sigment News
    • Loading...