Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమరావతికి రెండు బుల్లెట్ ట్రైన్లు!
posted on: Feb 12, 2026 8:16AM

దేశ వ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైళ్ల కారిడార్లను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడు కారిడార్లలో మూడు తెలుగు రాష్ట్రాల గుండా వెడతాయి. హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి. బెంగళూరు, చెన్నై వెళ్లే కారిడార్లు అమరావతి మీదుగా, చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ల రాకతో భవిష్యత్తుల్లో ఏపీ రూపురేకలు మారనున్నాయని అంటున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి కనెక్టివిటీ మరింత పెరగనుంది. కాగా తన హస్తిన పర్యటన సందర్భంగా విత్తమంత్రిని కలిసిన చంద్రబాబు.. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ కారిడార్కు సంబంధించి చిత్తూరు-తిరుపతి మధ్య 75 కిలోమీటర్ల వ్యూహత్మక కనెక్టివిటీ ఇవ్వాలని కోరారు.
దీని వల్ల కనెక్టివిటీ బెంగళూరు-అమరావతి కారిడార్కు ఎంతో మేలు చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. దీని వల్ల అమరావతి, బెంగళూరు మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుందనీ, అలాగే, బెంగళూరు-అమరావతి మధ్య అదనంగా ఒక బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందనీ తెలిపారు. చంద్రబాబు ప్రతిపాదన పట్ల విత్తమంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్లనుంది. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి గంటలోపే చేరుకోవచ్చు.


.webp)



