రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ట్వీట్
posted on: Nov 30, 2024 11:00AM
తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఈ రోజు(నవంబర్ 30) తో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఏడాది పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మార్పుకోసం పోలింగ్ బూత్ కు వెళ్లి అరక కట్టాల్సిన రైతు ఓటేశాడు, ఆ ఓటే అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగ రాసింది. ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తీసుకొచ్చామన్నారు. ఇది నెంబర్ కాదు రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం అన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కల్సి ఉమ్మడి పాల మూరుకు వస్తున్నా అని సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్ అయ్యింది.


.webp)
.webp)


