రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ట్వీట్ 

తెలంగాణలో  పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి  ఈ రోజు(నవంబర్ 30) తో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది.   ఏడాది పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మార్పుకోసం పోలింగ్ బూత్ కు వెళ్లి  అరక కట్టాల్సిన రైతు ఓటేశాడు, ఆ ఓటే అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగ రాసింది.  ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తీసుకొచ్చామన్నారు. ఇది నెంబర్ కాదు  రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం అన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కల్సి ఉమ్మడి పాల మూరుకు వస్తున్నా అని సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్ అయ్యింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu