అమృతారాయ్ ఈమెయిల్ హ్యాక్... అందుకే ఫొటోలు లీక్

 

 

 

కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో క్లోజ్‌గా వున్న ఫొటోలు మీడియాలోకి లీక్ అయ్యే సరికి ఇద్దరూ బయటపడ్డారు. మొదట దిగ్విజయ్ సింగ్ తనకు అమృతతో సంబంధం వుందని, ఆమెని పెళ్ళి చేసుకోబోతున్నానని ట్విట్టర్లో ప్రకటించాడు. ఆ తర్వాత కాసేపటికే అమృత కూడా ట్విట్టర్‌లో తనకు దిగ్విజయ్‌తో వున్న సంబంధం గురించి ప్రకటించింది. తాను తన భర్త నుంచి విడిపోతున్నానని, విడాకుల కోసం అప్లయ్ చేశానని, తాను త్వరలో దిగ్విజయ్ సింగ్‌ని పెళ్ళి చేసుకోబోతున్నానని అమృత ట్విట్ పోస్ట్ చేసింది. అదేవిధంగా ఆమె మరో ట్విట్ కూడా పోస్ట్ చేసింది. తన ఈమెయిల్‌ని, కంప్యూటర్ని ఎవరో హ్యాక్ చేశారని ట్వీట్ చేసింది. దీన్నిబట్టి అర్థమవుతున్న పాయింట్ ఏమిటంటే, అమృత కంప్యూటర్లో, ఈమెయిల్లో దిగ్విజయ్‌తో ఆమె సన్నిహితంగా వున్న ఫొటోలు వున్నాయి. ఎవరో హ్యాకర్లు ఆ ఫొటోలని బయటపెట్టారు.