తిరుమలలో కొత్త చట్టం... అధ్యయనంపై సీఎం ఆదేశాలు

posted on: Feb 23, 2026 2:32PM

 

టీటీడీలో నిబంధనలు కఠినతరం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో ఉన్నట్లు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఈ దిశగా అడుగులేస్తోంది. అన్య మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే రూల్‌ను కఠినతరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 

స్వర్ణ దేవాలయ చట్టంపై స్టడీ చేయాలని ఆదేశాలిచ్చారు. శాసన సభలో ముఖ్యమంత్రి ఛాంబర్‌లో చంద్రబాబును మంత్రులు కలిశారు. ఈ అంశాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి  ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీలో ఎలాంటి అపచారాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...