తృప్తి దేశాయ్ కొత్త డిమాండ్.. ఆర్ఎస్ఎస్ లో మహిళలను అనుమతించాలి..

posted on: Apr 25, 2016 6:07PM

 

స్త్రీ, పురుష వివక్షత లేకుండా అన్ని ఆలయాల్లోకి మహిళలను ప్రవేశింపజేయాని భూమాత బ్రిగేడ్ సంఘ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ ఇప్పటికే పోరాటం సాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో డిమాండ్ చేస్తున్నారు తృప్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సభ్యులుగా మహిళలను కూడా అనుమతించాలని.. మహిళల ఓట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆర్ఎస్ఎస్ కూడా తమ సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆమె అన్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు లేఖ రాయనున్నట్టు చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...