టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం

 

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఇప్పటి వరకు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని, పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఎన్నికల పర్యవేక్షకుడిగా వ్యవహరించిన మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేసీఆర్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనను ఆరుగురు మంత్రులు బలపరిచారని నాయిని తెలిపారు. దీంతో కేసీఆర్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నాయిని వివరించారు.