కాంగ్రెస్ లోకి అరవింద రెడ్డి!

 

 

 

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరతానంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసి చెప్పినట్లు సమాచారం. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అరవింద్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన మాట వాస్తవమేనని..తెలంగాణ ప్రజల పక్షానే ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో ఆయనకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు.