పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ లీడ్... 

posted on: Nov 2, 2021 8:22AM

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ లోని ఎస్సాఆర్ఆర్ కాలేజీలో ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. హుజురాబాద్ లో మొత్తం 753 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార టీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది. కారు పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్  యాదవ్ కు ఈటల రాజేందర్ పై  మెజార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కు 503 ఓట్లు రాగా.. బీజేపీకి  159 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు రాగా.. 14 ఓట్లు చెల్లకుండా పోయాయి. పోస్టల్ బ్యాలెట్ లో కారుకు కమలంపై 344 ఓట్ల లీడ్ వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...