Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీ కాంగ్రెస్, టీడీపీకి షాక్.. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్
posted on: Dec 3, 2015 10:39AM

తెలంగాణలో కాంగ్రెస్ కు, టీడీపీకి మరో షాక్ తగిలింది. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసందే. అయితే కేసీఆర్ తో భేటీ అనంతరం కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. గులాబీ కండువాలు కప్పి కేసీఆర్ ఇద్దరు నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ లో చేరా.. నా నియోజకవర్గం అభివృద్ధే నాకు ముఖ్యం.. సాధారణ ప్రజల కోసం కంటోన్మెంట్లోని ఆర్మీ రోడ్లను తెరిపించడంలో కేసీఆర్ ది కీలక పాత్ర. బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతాం అని వ్యాఖ్యానించారు.



.jpg)


