కమెడియన్ తో రొమాన్స్ కు సిద్ధమైన త్రిష...!
posted on: Dec 26, 2013 4:59PM

స్టార్ హీరోల నుండి యువ హీరోలందరితో కలిసి నటించిన హీరోయిన్ త్రిషకు తెలుగులో ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం తమిళంలో ఒకటి, అర చిత్రాలలో నటిస్తూ ఏదైనా సినిమా అవకాశం వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంది. అయితే ఈ తరుణంలో అమ్మడికి ఒక భారీ రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చింది. తాజాగా ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా పి.వి.పి. సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతుంది. అయితే ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ కావాలని భావించి, త్రిషను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయంపై త్రిషను అడగగానే ఒప్పేసుకుంది. కానీ భారీగా రెమ్యునరేషన్ అడిగిందట. త్రిష అడిగిన పారితోషకంను ఇవ్వడానికి చిత్ర నిర్మాతలు అంగీకరించడంతో త్రిష ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.







