Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కమెడియన్ తో రొమాన్స్ కు సిద్ధమైన త్రిష...!
posted on: Dec 26, 2013 4:59PM

స్టార్ హీరోల నుండి యువ హీరోలందరితో కలిసి నటించిన హీరోయిన్ త్రిషకు తెలుగులో ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం తమిళంలో ఒకటి, అర చిత్రాలలో నటిస్తూ ఏదైనా సినిమా అవకాశం వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంది. అయితే ఈ తరుణంలో అమ్మడికి ఒక భారీ రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చింది. తాజాగా ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా పి.వి.పి. సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతుంది. అయితే ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ కావాలని భావించి, త్రిషను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయంపై త్రిషను అడగగానే ఒప్పేసుకుంది. కానీ భారీగా రెమ్యునరేషన్ అడిగిందట. త్రిష అడిగిన పారితోషకంను ఇవ్వడానికి చిత్ర నిర్మాతలు అంగీకరించడంతో త్రిష ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.






