త్రిష, ఛార్మి, నిఖిషా సంచలన ఫొటోలు...

 

ఇటీవలే పెళ్ళి కుదిరిన హీరోయిన్ త్రిష, మరో ఇద్దరు హీరోయిన్లు ఛార్మి, నికిషా పటేల్ సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు సంచలనం సృష్టిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ఎక్కడో ఓ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. ముగ్గురూ కలసి మస్తుగా ఎగిరారు. ఒకరిని మరొకరు కౌగిలించుకుని ఫొటోలకు పోజిచ్చారు. ఈ సంతోషమంతా త్రిష పెళ్ళి కుదిరినందుకేనని అర్థమవుతూనే వుంది. ఈ ఫొటోలను పోస్టు చేయడంతోపాటు వాటి కింద పెట్టిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. ఈ ముగ్గురూ తమను తాము మూడు కోతులతో పోల్చుకున్నారు. తమ ముగ్గురిలో ఒక కోతి వికెట్ పడిపోయిందని, ఇంకా రెండు కోతుల వికెట్లు కూడా పడబోతున్నాయని కామెంట్ పెట్టారు. అంటే, తమ ముగ్గురిలో త్రిషకు పెళ్ళి కుదిరిపోయింది... త్వరలో తమకూ పెళ్ళి కుదరబోతోందని వాళ్ళు అన్యాపదేశంగా చెప్పారు. అంతేలే.. ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఇప్పటికే కాస్త లేటయింది.. మొత్తమ్మీద ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకీ అభినందనలు.