Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైల్లో దోపిడీ యత్నం
posted on: Apr 9, 2015 3:21PM
.jpg)
రైళ్లలో చోరీలకు పాల్పడేవాళ్లు ఎక్కువైపోయారు. వీరికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఇటీవల చార్మినార్ ఎక్స్ప్రెస్లో జరిగిన దోపిడిని మరచిపోకముందే మళ్లీ అదే తరహాలో పుణె-హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో దోపిడి దొంగలు భీభత్సం సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని గొల్లగూడ-శంకరపల్లి మధ్యలో ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగలు ప్రయాణికులను కత్తులతో బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బును దోచుకునేందుకు ప్రయత్నించారు. దీనిని ప్రతిఘటించినందుకు ఇద్దరు ప్రయాణికులను గాయపరిచి పారిపోయారు.బాధితులు జరిగిన ఘటనపై వికారాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం గాలిస్తున్నారు.






