రైలు ప్రమాద సంఘటనా స్థలానికి చేరుకున్న చిరంజీవి

posted on: May 22, 2012 10:57AM

అనంతపురం జిల్లాలో ఉన్న ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రైలు ప్రమాద సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్కడ రైలు ప్రమాదలు జరిగిన ఎక్కువగా మానవ తప్పిద౦ వల్ల ఇలాంటి సంఘటనాలు జరగటం దురదృష్టకరమన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అని చిరంజీవి అన్నారు. ఇలాంటి సంఘటనాలు జరగటం చాల భాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అటు సంఘటనా స్థలిని పరిశీలించేందుకు రైల్వే మంత్రి ముకుల్ రాయ్ పెనుగొండ వస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...