Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోట్లాది భక్తుల ముందే..శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్
posted on: Jun 14, 2017 3:00PM

ఈగ కూడా లోపలికి రానంత సెక్యూరిటీ..కోట్లాది మంది భక్తులు..దేనినైనా క్షణంలో పసిగట్టే నిఘా కెమెరాలు ఇంత భద్రత ఉన్నా..సాక్షాత్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలోనే ఓ చిన్నారి కిడ్నాప్కు గురవ్వడం భక్తులను కలవరానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే వెంకన్న ఆలయం ఎదుట ఉన్న గొల్ల మండపం వద్ద తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న ఏడాది వయసున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. తెల్లవారుజామున నిద్రలేచిన ఆ తల్లిదండ్రులకు తమ బిడ్డ పక్కన లేకపోవడంతో..అటు ఇటు వెతికారు. ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుడు చిన్నారిని తీసుకువెళుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. చిన్నారిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పోలీసులు.


.jpg)
.jpg)


