రోజుకు మూడు లక్షల లడ్డూలు

 

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ అంటే ఇష్టం లేనిదెవరికి? శ్రీవారి లడ్డూ భక్తులకు మహా ప్రసాదం. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. భక్తి, ముక్తి విషయంలో మాత్రమే కాదు... రుచి విషయంలో కూడా తిరుమల లడ్డు ప్రత్యేకతే వేరు. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే శ్రీవారి లడ్డూ ఎవరికైనా స్పెషల్ ఎట్రాక్షన్.. అయితే తిరుమలలో వీఐపీ భక్తులకు తప్ప సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో లడ్లు దొరకవన్న అభిప్రాయం వుంది. క్యూలో వెళ్ళే సమయంలో ఇచ్చే లడ్లు సరిపోకపోవడంతో భక్తులు ఆ తర్వాత గంటలు గంటలు క్యూలో నిల్చుని అదనంగా లడ్లు కొనుగోలు చేస్తూ వుంటారు. అయితే ప్రస్తుతం తిరుమలలో రోజుకు భక్తుల కోసం రెండు లక్షల లడ్డు తయారు చేస్తున్నారు. ఈ లడ్లు సరిపోవడం లేదు. దాంతో ఇకపై రోజుకు మూడు లక్షల లడ్లు చేయాలని టీడీటీ ఇవో నిర్ణయించారు. లక్ష లడ్లు అదనంగా సమకూరడం వల్ల ఇకపై భక్తులకు లడ్లు సులభంగా లభించే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. లడ్ల తయారీని పెంచడానికి వీలుగా ఇటీవల పోటును విస్తరించారు కూడా.