శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

posted on: Oct 19, 2025 10:39AM

 

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం  శ్రీవేంకటేశ్వర స్వామి వారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఈ తరుణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సర్వ దర్శనం కోసం భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 82,136 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,023 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...