కావూరి, కిల్లి కృపారాణికి ఓటర్లు షాక్
posted on: Jul 31, 2013 6:57PM
.jpg)
కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి కూడా స్వగ్రామంలో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ఆమె స్వగ్రామం పోలవరంలో స్వతంత్ర అభ్యర్థి బాలకృష్ణ కాంగ్రెసు పార్టీ పైన ఘన విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావుకు స్వగ్రామంలో షాక్ తగిలింది. బుధవారం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఆయన పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. దోసపాడు కావూరి స్వగ్రామం. కాంగ్రెసు అభ్యర్థి పైన టిడిపికి చెందిన శివ కుమార్ 950 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.



.jpg)


