Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...18 మంది టెర్రరిస్టులు ఖతం
posted on: Apr 17, 2015 2:17PM

టెర్రరిస్టులు ఖతమయ్యారనే వార్త ఈ ప్రపంచానికి నిజంగానే శుభవార్తే. అలాంటి శుభవార్త మరోసారి వినే అవకాశం వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది టెర్రరిస్టులు ఖతమయ్యారు. ఈజిప్టులోని నార్త్ సినాయ్ ప్రావిన్స్లో జరిగిన సైనిక దాడుల్లో ఈ 18 మంది మరణించారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలో తీవ్రవాదుల ఆగడాలను అరికట్టడానికి సైనిక బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో ఈ తీవ్రవాదులు హతమయ్యారు. మరో నలుగురు తీవ్రవాదులను సజీవంగా పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదుల మీద భద్రతా దళాలు సాధించిన చాలా చిన్న విజయమిది. చంపడంలో ఇప్పటి వరకు తీవ్రవాదులదే పైచేయిగా వుంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 500 మంది భద్రతా సిబ్బందిని తీవ్రవాదులు చంపేశారు.






