18 మంది టెర్రరిస్టులు ఖతం

 

టెర్రరిస్టులు ఖతమయ్యారనే వార్త ఈ ప్రపంచానికి నిజంగానే శుభవార్తే. అలాంటి శుభవార్త మరోసారి వినే అవకాశం వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది టెర్రరిస్టులు ఖతమయ్యారు. ఈజిప్టులోని నార్త్ సినాయ్ ప్రావిన్స్‌లో జరిగిన సైనిక దాడుల్లో ఈ 18 మంది మరణించారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలో తీవ్రవాదుల ఆగడాలను అరికట్టడానికి సైనిక బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో ఈ తీవ్రవాదులు హతమయ్యారు. మరో నలుగురు తీవ్రవాదులను సజీవంగా పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదుల మీద భద్రతా దళాలు సాధించిన చాలా చిన్న విజయమిది. చంపడంలో ఇప్పటి వరకు తీవ్రవాదులదే పైచేయిగా వుంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 500 మంది భద్రతా సిబ్బందిని తీవ్రవాదులు చంపేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu