Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీవాణి ట్రస్ట్ రద్దు... టిటిడి పాలకమండలి నిర్ణయం
posted on: Nov 18, 2024 3:35PM
శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపు విషయంలో టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణల నేపథ్యంలో టిటిడి మొదటి పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. . ట్రస్ట్ కార్యకలాపాలను రద్దు చేయాలని నిర్ణయంచినట్టు టిటిడి చైర్మెన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంలో ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హాయంలో టీటీడీ పూర్తిగా గాడి తప్పింది. గత ఐదేళ్లలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1450 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలతో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. టిటిడి చైర్మెన్, ఈవో అధ్యక్షతన బోర్డు భేటీ అయ్యింది.



.webp)


