Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం వశం
posted on: Feb 3, 2025 11:38AM
.webp)
హిందూపురం మునిసిపాలిటీ తెలుగుదేశం వశమైంది. మునిసిపల్ చైర్మన్ గా రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. మునిసిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికలో తెలుగుదేశం విజయం సాధించింది. ఈ ఎన్నికలో తెలుగుదేశం కు 23 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మికి కేవలం 14 ఓట్లు మాత్రంమే వచ్చాయి. చేతులు ఎత్తే పద్ధతిన ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో కలుపుకుంటే తెలుగుదేశం కూటమి బలం 23. దీంతో సునాయాసంగా హిందూపురం మునిసిపాలిటీ తెలుగుదేశం ఖాతాలో చేరిపోయింది.
నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే కావడంతో ఈ మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పలువురు వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇప్పుడు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో అలా రాజీనామా చేసిన కౌన్సిలర్లకు వైసీపీ విఫ్ జారీ చేయడంతో ఉత్కంఠ మొదలైంది. చివరకు తెలుగుదేశం పార్టీ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది.



.webp)


