తెలంగాణ అధికారిక చిహ్నాల ప్రకటన

posted on: Nov 17, 2014 1:34PM

 

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్), రాష్ట్ర పుష్పంగా తంగేడు, జంతువుగా జింక, చెట్టుగా జమ్మి చెట్టును ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఆంధ్రుల దృక్కోణంలో రాష్ట్ర అధికార చిహ్నాలను విడుదల చేశారని, ఇప్పుడు తెలంగాణ దృక్కోణంలో వీటిని ఎంపిక చేశామని ఆ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జంతువుగా వృషభాన్ని ఎంపిక చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. శక్తికి, పౌరుషానికి ప్రతీకగా వుండే వృషభం అయితే బాగుంటుందన్న అభిప్రాయాలు గతంలో వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా జింకను తెలంగాణ రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...