సమ్మె ఆగినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదు : నారాయణ

posted on: Oct 26, 2011 9:19AM

హైదరాబాద్: తెలంగాణ సమ్మె ఆగినంత మాత్రాన ఉద్యమం ఆగిపోయిందనే మూర్ఖపు ఆలోచన మంచిది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు.తెలంగాణ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆర్డీఎస్ లాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయని  ఆయన  మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని ఆయన అన్నారు. ముంపును తగ్గించే విధంగా డిజైన్ మార్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడ మంచిది కాదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ప్రభుత్వం జాప్యం చేయకుండా రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాలయాపన కమిటీలతో ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వేలమంది పోలీసుల భద్రతతో సోంపేట థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అనడాన్ని ప్రస్తావిస్తూ దమ్ముంటే ప్రాజెక్టును కట్టాలని ఆయన సవాల్ చేశారు. కర్నూలులో తమ పార్టీ కార్యకర్తలు చేయి చేసుకున్నారని జిల్లా వైద్యాధికారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని, ఆలాంటిదేమీ జరగలేదని, విజువల్స్ తెప్పించుకుని విచారణ జరిపించాలని, తమ పార్టీ కార్యకర్తలు తప్పు చేశారని తేలితే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...