Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సచివాలయ బదలాయింపు జరిగేనా?
posted on: May 12, 2015 10:57AM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సచివాలయాన్ని మార్చలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సచివాలయ నిర్మాణాన్ని తొలుత ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో నిర్మించాలనుకున్నారు. కాని దానికి పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఆయన కంటోన్మెంట్ లోని బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాల్ని తమకు ఇవ్వాల్సిందిగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్కు లేఖ రాశారు. కేసీఆర్ లేఖకు స్పందించిన మనోహర్ పారికర్ ఆస్థలాల సమాచారాన్ని అందజేయాలని స్థానిక డిఫెన్స్ ఎస్టేట్స్, లోకల్ మిలటరీ అథారిటీస్ అధికారులను ఆదేశించారు. రక్షణశాఖ అధికారుల ఆదేశం మేరకు స్థానిక అధికారులు దానికి సంబంధించిన నివేదికను సోమవారం అందజేశారు. నివేదిక ఆధారంగా రక్షణ మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం వెలువరించే అవకాశమున్నట్లు సమాచారం. సచివాలయ బదాలయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, అంగీకారాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, లోకల్ మిలటరీ అధికారులు సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమావేశం సజావుగా సాగితే సచివాలయం బదాలాయింపు జరిగినట్టే.


.jpg)



