తెలంగాణ తెచ్చేది బీజేపీనే

 

 

telangana issue, BJP telangana, separate telangana issue

 

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆరోపించారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఎదో ఒకటి తేల్చాలని ఆయన కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చేది ఇచ్చేది బీజేపీనే అని వెంకయ్యనాయుడు తెలిపారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన పేర్కొన్నారు. విశ్వాసనీయమైన ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.