తెలంగాణ సమస్య మండే అగ్ని లావా

posted on: Mar 24, 2013 5:35PM

 

 

 jaipal reddy telangana issue,telangana issue jaipal reddy, congress jaipal reddy

 

 

కల్వకుర్తిలో 17 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ తపస్సు చేశానని, కల్వకుర్తి ప్రజలకు రుణపడి ఉంటానని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకు చేరుకున్న ఆయన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి తనకు రాజకీయా పాఠశాల అని, పుస్తకాలు చదివి రాజకీయాలు చేయలేరని ఆయన తెలిపారు. తెలంగాణ మండే అగ్ని లావాలా ఉందని, అప్పుడప్పుడు జ్వాలలు ఎగసి పడుతున్నాయని జైపాల్ రెడ్డి అన్నారు.కేంద్రంలో అధికార పార్టీ పక్షాన మంత్రిగా ఉన్నాను కాబట్టి మాట్లాడలేకపోతున్నానని ఆయన అన్నారు. తెలంగాణపై తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...