TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరట

Published on: Mon Sep 28, 2015 12:43PM


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నుండి ముగ్గురు, కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు, వైసీపీ పార్టీనుండి ఒక్కరు పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ నేత ఎర్రబెల్లి.. కాంగ్రెస్ పార్టీ నేత సంపత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని అటు తెలంగాణ అధికార పార్టీని.. స్పీకర్ ను ఆయా పార్టీల నేతలు చాలా సార్లు అడిగారు. దీనిలో భాగంగా గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారివల్ల ఎలాంటి ఉపయోగంలేని కారణంగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇది స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని.. స్పీకర్ ను ఆదేశించలేమని తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో ఆలోచన చేయాలని మాత్రమే సూచించింది.