హై కోర్టులో సమగ్ర సర్వే కేసు... రేపటికి వాయిదా...

posted on: Aug 13, 2014 5:15PM

 

ఈనెల 19వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర సర్వే మీద అనేక వివాదాలు ముసురుకున్నాయి. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలు కూడా ఈ సర్వేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద హైదరాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది సర్వేకి సంబంధించి ఇంకా సవరణలు వున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించబోయే సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు, సవరణలతో గురువారం నాడు కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేస్తూ, హైకోర్టు కేసును వాయిదా వేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...