జోస్యం చెపుతున్న కేసీఆర్

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెపుతున్నారు. కేసీఆర్ జోస్యం చెప్పడమేంటీ అనకుంటున్నారా... 2019లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే అధికారాన్ని చేపడుతుందని జోస్యం చెపుతున్నారు. డబ్పు కావాలంటే, డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి కానీ... ప్రజా ప్రతినిధులు మాత్రం మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలని, ప్రజల పక్షాన్నే నిలవాలని సూచించారు. టీఆర్ఎస్ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అనుకున్నది సాధించడం టీఆర్ఎస్ నైజమని అన్నారు. తెలంగాణ రాదన్న వారికి దానిని సాధించి చూపించామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోయే పని చేయాలని, లేకపోతే మనమే చరిత్రలో కలిసిపోతామని అన్నారు.