Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ మేడే కానుక
posted on: May 1, 2015 1:25PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రమను పరిశ్రమలు దోపిడీ చేయకూడదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలకు రవాణా పన్ను లేకుండా చేశాం, గతంలో ఉన్న రవాణా పన్నుబాకాయిలను కూడా మాఫీ చేశామన్నారు. బీడీ కార్మికులుకు ప్రత్యేక బృతి కల్పించిన ఘనత టీఆర్ఎస్ దే అన్నారు. తెలంగాణలో హోంగార్డులకు డ్రైవర్లకు, జర్నలిస్టులకు రూ 5. లక్షల ఉచిత ప్రత్యేక ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అలాగే తెలంగాణలో ఇక నుండి విద్యుత్ కోతలు ఉండవని అన్నారు. వేలాది పరిశ్రమలు తెలంగాణకు రాబోతున్నాయని, యువతలో స్కిల్స్ డెవలప్ చేయడానికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.






