ఇంకా ఆంధ్రోళ్లేనా.. నవ్వుకుంటారు.. ఎర్రబెల్లి


 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నా ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ ధనిక రాష్ట్రం అని అనిపించుకున్నా రైతలు మాత్రం ఇంకా పేదవారిగానే ఉన్నారని అన్నారు. ఎప్పుడు చూడు ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అంటూ తిట్టడం.. గత ప్రభుత్వాల తీరును విమర్సించడం.. ముందు తిట్టడం ఆపి అసలు ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఇంకా వాళ్లనే తిట్టుకుంటూ పబ్బం గడుపుతుంటే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ప్రభుత్వం ఎందుకు తగ్గిస్తుందని నిలదీశారు. పౌల్ట్రీ రైతుల కంటే మామూలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కేంద్రానికి సర్కారు నివేదిక ఎందుకు పంపించడం లేదో చెప్పాలన్నారు.