Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాడు
posted on: Oct 5, 2015 1:05PM

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు, తెలంగాణ అసెంబ్లీ మామా అల్లుళ్లకు ఆటవిడుపు కేంద్రంగా మారిందని, అందుకే సభలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు, 32మంది విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమన్న రేవంత్ రెడ్డి... ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై పోరాడుతూనే ఉంటామన్నారు, తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 1400మంది రైతులకు 6లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్న రేవంత్, మిగిలిన రుణమాఫీని ఒకే విడతలో చేయాలని డిమాండ్ చేశారు, ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్... రైతుల రుణాలు మాఫీ చేసేందుకు మాత్రం డబ్బుల్లేవా అంటూ ప్రశ్నించారు, ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం 40వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు కానీ...రైతులకు సాయం చేయడానికి డబ్బు ఎందుకు లేదని నిలదీశారు. రైతులకు న్యాయం జరిగేవరకూ ముఖ్యమంత్రిని మంత్రులను నిలదీస్తూనే ఉంటామని, జిల్లాల్లో వారి పర్యటనలను అడ్డుకుంటామని రేవంత్ హెచ్చరించారు.






