అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పై ఎర్రబెల్లి సెటైర్లు

posted on: Sep 29, 2015 3:23PM

రైతు ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు... ముఖ్యమంత్రి కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ ను తాము చూడాలనుకుంటున్నామన్న ఎర్రబెల్లి... దేశంలోనే ఆయన ఆదర్శ రైతు అంటూ సెటైర్లేశారు, తనకు ఎకరానికి కోటి రూపాయలు ఆదాయం వస్తుందన్న కేసీఆర్... మళ్లీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు, ఇజ్రాయెల్, చైనా టూర్లకు రైతులను కూడా తీసుకెళితే వ్యవసాయ మెళకువలు తెలుసుకుని మంచి రాబడి సాధిస్తారు కదా అంటూ వ్యాఖ్యానించారు. తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న కేసీఆర్... తన ఫాంహౌస్ ను రైతులకు, ఎమ్మెల్యేలకూ చూపిస్తే, ఆయన పాటించే వ్యవసాయ పద్ధతులను తామూ నేర్చుకుంటామంటూ చమత్కరించారు

google-ad-img
    Related Sigment News
    • Loading...